నంద్యాల, జూన్ 29 (డిగ్నిటి న్యూస్): సమాజంలో మార్పు కోసం, పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాపక్షం వహించి పోరాడటమే జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశమని నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు సుందర్ స్పష్టం చేశారు. నంద్యాల నియోజకవర్గ స్థాయి జనసేన సోమవారం నంద్యాల బొమ్మల సత్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ‘జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దరఖాస్తుల సేకరణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి…
నంద్యాల హోటల్పై ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ!
నంద్యాల, జూన్ 28 డిగ్నిటి (న్యూస్): నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో ఉన్న ‘క్లాసిక్ బిర్యానీ హౌస్’ హోటల్లో విక్రయించిన చికెన్ రోస్ట్లో బొద్దింక కనిపించిందనే అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ఫిర్యాదులు, మీడియా కథనాల ఆధారంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ సదరు హోటల్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా హోటల్లోని వంటగది, ఆహార పదార్థాల నిల్వ విధానం, వంట నాణ్యత, లైసెన్స్లు మరియు ఫుడ్ సేఫ్టీ నిబంధనల అమలును…
జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం
మంగళగిరి, జూన్ 28 (డిగ్నిటి న్యూస్): మంగళగిరిలోని సికే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడు దొడ్ల సురేష్ చౌదరి అక్కడకు చేరుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే…
ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం
నల్లగొండ, జూన్ 28 (డిగ్నిటి న్యూస్): ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు, కార్మిక సంఘాల నేతలు, ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలకూరి రవిగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వాలు శాంతియుత నిరసనలను, ప్రజాస్వామిక హక్కులను కాలరాసేలా వ్యవహరించడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, తెల్లవారుజామునే నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి నిర్బంధ చర్యలతో…
ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి
గుత్తి, జూన్ 27 (డిగ్నిటి న్యూస్): గుత్తి పట్టణంలో ఐదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ బాల బాలికల వసతి గృహాల (హాస్టల్స్) నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి, అందుబాటులోకి తెవాలని హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి. మోహన్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ మోడల్ కళాశాల ఆవరణలో విద్యార్థినులతో కలిసి ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ.. ఏళ్లు గడుస్తున్నా…
కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఇళ్లపై ఏసీబీ దాడులు
కర్నూలు, జూన్ 27 (డిగ్నిటి న్యూస్): ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో తిరుపతి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా పనిచేస్తున్న యుగంధర్ ముని ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కర్నూలు, తిరుపతితో పాటు ఆయనకు సంబంధమున్న మరో రెండు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తెల్లవారుజాము నుంచే విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో ప్రాథమికంగా నాలుగు కోట్లకు పైగా…
ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి
కొలిమిగుండ్ల, జూన్ 27 (డిగ్నిటి న్యూస్): మండల పరిధిలో ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా ఆదివారం (జూన్ 28) నిర్వహించనున్న పోలియో చుక్కల కార్యక్రమంపై శనివారం కొలిమిగుండ్లలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆరోగ్య కేంద్రం పరిసరాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో సిబ్బంది పోలియో రహిత…
SIR ఫారాల భర్తీపై గొల్లగూడెంలో అవగాహన
– ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ నకిరేకల్, జూన్ 27 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో శనివారం స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఒక నిర్దిష్ట ప్రక్రియకు సంబంధించిన ఫారాలను ఎలా నింపాలి, వాటిని ఎందుకు నింపాలి అనే విషయాలపై గ్రామ ప్రజలకు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ దీనిపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, అలాగే దీని గురించి తెలియని…
నల్లగొండ బ్రేకింగ్:
నల్గొండ నియోజకవర్గం, జూన్ 26 (డిగ్నిటి న్యూస్): కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన సుల్తాన్, హసీనా, ముజమ్మిల్, అఫ్కూరా మృతదేహాలు ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో లభించడంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది… మొదట ఇది హత్యా… ఆత్మహత్యా… అనే అనుమానాలతో ప్రారంభమైన దర్యాప్తు… చివరకు ఊహించని నిజాలను బయటపెట్టింది… బంధుత్వమే నమ్మకం… అదే బంధుత్వం రక్తపాతానికి దారి తీసింది! హసీనా ఇంటి తలుపు తట్టింది పరాయి వ్యక్తి కాదు… సొంత అక్క కూతురు తబస్సుం భర్త…
జులై 19న ‘గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి’
డిగ్నిటి న్యూస్, నంద్యాల జూన్ 25: నంద్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జులై 19న నిర్వహించనున్న ‘చలో నంద్యాల గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి’ సభ పోస్టర్లను ఆర్పీఎస్, ఆర్ఈఎఫ్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు శేషపని, రాష్ట్ర యూత్ అధ్యక్షులు పెరుగు శివకృష్ణ మాట్లాడుతూ, దేశంలో 85 శాతం ఉన్న బహుజనులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు…










