RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

పాణ్యం వద్ద తప్పిన బస్సు ప్రమాదం: ప్రయాణికులు క్షేమం

పాణ్యం, జూలై 12 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎన్‌హెచ్ 40 జాతీయ రహదారిపై విజయానికేతన్ స్కూల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సుకు ప్రమాదం తప్పింది. 27 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు సిబ్బందితో హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న బస్సు కుడివైపు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో నియంత్రణ కోల్పోయిన బస్సు డివైడర్ ఎక్కి అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో…

🌿 మందుల కంటే సూపర్ ఫుడ్స్ మిన్న – సహజ ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. 🌿

పరిచయం : ఆరోగ్యంగా జీవించడానికి కేవలం మందులపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. మన రోజువారీ ఆహారంలో సహజసిద్ధమైన పోషకాహారాలను చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ప్రకృతిలో లభించే పండ్లు, కూరగాయలు, గింజలు, తేనె వంటి ఆహార పదార్థాలను “సూపర్ ఫుడ్స్” అని పిలుస్తారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని అవయవాలను బలోపేతం చేయడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక…

బనగానపల్లెలో ‘మీ భూమి-మీ హక్కు’ పాస్‌పుస్తకాల పంపిణీ

కొలిమిగుండ్ల, జూలై 9 (డిగ్నిటి న్యూస్ ): నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న “మీ భూమి – మీ హక్కు”రైతుల పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని బనగానపల్లెలో మొదటిసారిగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కూడిన నూతన పాసుపుస్తకాలను రైతులకు అందజేసే ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కొలిమిగుండ్ల మండలం నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ముఖ్య విశేషాలు: చంద్రబాబు…

తమ్మరాజుపల్లె వద్ద కారు ప్రమాదం: ఆళ్లగడ్డ రూరల్ ఏఎస్ఐ దుర్మరణం

పాణ్యం, జూలై 5 డిగ్నిటి న్యూస్: నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్‌లో సహాయ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ)గా విధులు నిర్వహిస్తున్న సురేష్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కర్నూలు నుంచి నంద్యాల వైపునకు కారులో వస్తుండగా తమ్మరాజుపల్లె సమీపంలో అకస్మాత్తుగా కారు టైరు పేలిపోవడంతో (బరస్ట్) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం.. ఏఎస్ఐ సురేష్ రెడ్డి మరో…

పెద్దకాపర్తి వద్ద ఘోర ప్రమాదం: నలుగురు దుర్మరణం

నల్గొండ జిల్లా చిట్యాల, జూలై 05 (డిగ్నిటి న్యూస్): నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తున్న కారును ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారు నడుపుతున్న ఎస్‌బీఐ ఉద్యోగి ప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని…

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ‘రావుస్’ ప్రభంజనం

నంద్యాల, జూలై 2 (డిగ్నిటి న్యూస్): ఇటీవల విడుదలైన ఏపీ ఈఏపీసెట్‌-2026 ఫలితాల్లో రావుస్ విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో సరికొత్త రికార్డు సృష్టించారని కళాశాల చైర్మన్ యం.వి. అప్పారావు, డైరెక్టర్ మోని చంద్ర సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా అగ్రికల్చర్ విభాగంలో కళాశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి 82వ ర్యాంకు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారని, అలాగే 635వ ర్యాంకుతో పాటు ఎం. వైష్ణవి 717వ ర్యాంకు సాధించి సంస్థ కీర్తిని…

కాంగ్రెస్ నూతన అధ్యక్షులకు ఘన సన్మానం

నల్గొండ నియోజకవర్గం, జూలై 2 (డిగ్నిటి న్యూస్): నల్గొండ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను శుక్రవారం నల్గొండలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. బాధ్యతలు స్వీకరించిన నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గంగుల సైదులు, కనగల్ మండల అధ్యక్షుడు గడ్డం అనుప రెడ్డి, తిప్పర్తి మండల అధ్యక్షుడు పాదూరి శ్రీనివాస్ రెడ్డిలకు నాయకులు శాలువాలు కప్పి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ…

వైసీపీ ప్రజాధనాన్ని వృధా చేసింది.. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలి: ఎంపీ బాలశౌరి

నంద్యాల, జూలై 1 (డిగ్నిటి న్యూస్): మూడు రాజధానుల పేరుతో వైజాగ్ లో రూ.500 కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం వృధా చేసిందని, ఇప్పుడు అక్కడ వద్దని వాళ్లే చెబుతున్నారని ఎంపీ బాలశౌరి విమర్శించారు. బుధవారం నంద్యాలలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిని రాజధానిగా పార్లమెంట్ లో చట్టం చేశారని, వైసీపీ ముందుగా చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం చట్టప్రకారం వెళుతుంది కాబట్టే సాయికృష్ణ మృతిపై సీఐ నాగరాజును,…

మానవాళి రక్షణలో వైద్యుల పాత్ర అనన్యం

డిగ్నిటి న్యూస్ ప్రత్యేకం: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన, సమాజ శ్రేయస్సులో వైద్యుల త్యాగాలను స్మరించుకుంటూ సత్తుపల్లి వైద్యురాలి ప్రత్యేక సందేశం.ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ అనువంశిక ఆయుర్వేద క్యాన్సర్ నిపుణులు డాక్టర్ సుధారాణి కొనకళ్ళ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజంలో వైద్యుల పాత్ర, ప్రస్తుత సవాళ్లపై పలు కీలక విషయాలను పంచుకున్నారు. సమాజ రక్షణలో మరియు ప్రజల ప్రాణాలను కాపాడటంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వైద్యుల నిరంతర సేవలకు, త్యాగాలకు…

బాబోయ్‌.. దొంగలు!

నంద్యాల, జూన్ 30 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పట్టణంలోని రైతునగర్‌ సమీపంలోని శ్రీసాయినగర్‌ వెంచర్‌లో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఒక ముఠా ముఖాలకు ముసుగులు ధరించి ప్రధాన ద్వారం గుండా కాలనీలోకి ప్రవేశించింది. ఆపై కాలనీ వీధుల్లో దాదాపు అరగంట పాటు యథేచ్ఛగా సంచరిస్తూ అనుకూలమైన ఇళ్ల కోసం వేట సాగించింది. ఈ క్రమంలోనే ఒక వీధిలో తాళం వేసి ఉన్న ఓ…