RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

విద్యా సమస్యలు పట్టవా?.. మంత్రి లోకేష్‌పై పిడిఎస్‌యూ నిప్పులు

నంద్యాల, జూన్ 25 (డిగ్నిటి న్యూస్): రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పిడిఎస్‌యూ (ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్) నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల కేంద్రంలోని పద్మావతి నగర్ ఆర్చి వద్ద పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా రంగ సమస్యలపై విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు.ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడిఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి…

డ్రగ్స్ వద్దు.. చదువులే ముద్దు

గాజువాక/విశాఖపట్నం, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి, విద్యాభ్యాసంపైనే దృష్టి సారించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ (ఎన్‌సీఆర్‌సీ) ప్రతినిధులు పిలుపునిచ్చారు. గాజువాక కాంతి రోడ్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఆధ్వర్యంలో ‘నశా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌సీఆర్‌సీ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే…

నంద్యాలలో ఘనంగా వైద్య విద్యా సదస్సు

నంద్యాల, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో, హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో ఆసుపత్రి సహకారంతో స్థానిక మధుమణి ఆసుపత్రి సమావేశ భవనంలో నంద్యాల ప్రాంత వైద్యులకు నిరంతర వైద్య విద్య సదస్సును ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా…

నియమ నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలను సీజ్ చేయాలి

నంద్యాల, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను వెంటనే సీజ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఏబీవీపీ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అక్రమంగా విక్రయిస్తున్న పుస్తకాలను విద్యార్థి నాయకులు అడ్డుకుని సీజ్ చేయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కర్నూల్ విభాగ్ కన్వీనర్ యుగంధర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలను…

హిజ్రాల వేధింపులు అరికట్టండి

ఆళ్లగడ్డ, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): ఆళ్లగడ్డ పట్టణంలో హిజ్రాల ఆగడాలతో వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, వారి వేధింపులను తక్షణమే అరికట్టాలని జాయింట్ యాక్షన్ కమిటీ (ఐకాసా) నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని టీబీ రోడ్డులోని ప్రధాన రహదారిలో ఉన్న దుకాణాల వద్దకు నిత్యం ఎవరో ఒకరు హిజ్రాలు వస్తూ, దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఐకాసా కన్వీనర్ బీరువాల భాష, మాలల సంక్షేమం మరియు అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెన్నెం…

నల్గొండ బస్టాండ్ విస్తరణ పనులకు శంకుస్థాపన

రెండు కొత్త సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలే లక్ష్యం నల్గొండ నియోజకవర్గం, జూన్ 24 (డిగ్నిటి న్యూస్):నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర ప్రజల రవాణా అవసరాల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు నూతన సిటీ బస్సులను మంత్రి…

నల్గొండలో రాపోలు ఆస్పత్రి ప్రారంభం

ఘనంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ నియోజకవర్గం, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రాపోలు హాస్పిటల్‌ను బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆస్పత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య…

మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇమామ్ ఖాసీం స్వామి పీర్లకు ప్రత్యేక పూజలు

బనగానపల్లె, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): పవిత్ర మొహర్రం పర్వదినాల వేడుకల్లో భాగంగా 8వ రోజు బుధవారం బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేట ప్రాంతానికి చెందిన ఇమామ్ ఖాసీం స్వామి పీర్ల (సవారీ) ఊరేగింపు వైభవంగా సాగింది. ఈ ఊరేగింపులో భాగంగా పీర్ల చావడి మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యులు బీసీ ఇందిరా రెడ్డి స్వామివారికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఫతేహాలు సమర్పించి…

ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ ఆర్టీసీ సంస్థకు అప్పజెపాలి జేఏసీ నాయకులు…

ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ ఆర్టీసీ సంస్థకు అప్పజెపాలి జేఏసీ నాయకులు… ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సంస్థకు అప్పజెప్పాలని ఆళ్లగడ్డ డిపో ఉద్యోగ సంఘ JAC కార్మిక సంఘ నాయకులు ఎన్ఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్, సలాం, డిమాండ్ చేశారు. మంగళవారం ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో ఆవరణం నందు కార్మిక సంఘాలు, జేఏసీ నాయకులు,పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఎం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొని…

యాగంటి ఆలయానికి రూ.50,112 విరాళం

దాతలకు ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాల వితరణ బనగానపల్లి, జూన్ 21 (డిగ్నిటి న్యూస్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి ఆదివారం భారీ విరాళం అందింది. విజయవాడకు చెందిన ప్రముఖ వాస్తవ్యులు శ్రీ బుర్లే వెంకట సుబ్బారావు తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసారు. ఈ సందర్భంగా వారు దేవస్థాన నిత్య అన్నదాన లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రూ.50,112/- ల నగదును విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ…