రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాలు ఆర్థికంగా మరోసారి కల్పిస్తున్నాం.
ప్రభుత్వ విప్పు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 5 (డిగ్నిటీ న్యూస్) సాయిబాబా మందిర్ లో నకిరేకల్, కేతపల్లి,కట్టంగూర్ మండలాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి అన్నారు . అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నామని అన్నారు . ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్నాం” అని తెలిపారు.లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పథక లబ్ధిదారులు పాల్గొన్నారు.
