నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లి మెట్ట సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రవరం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కామరాజనపల్లె రోడ్డువైపు వెళ్తున్న పెద్దసిద్దయ్య ప్రయాణిస్తున్న మోటార్సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దసిద్దయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సిరివెళ్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గోవిందపల్లి మెట్ట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
