నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటీ న్యూస్): నల్లగొండ పట్టణం గాంధీనగర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు వీరమల్ల వంశీకృష్ణ గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జియాలజీ విభాగంలో డాక్టరేట్ పొందారు. ప్రొఫెసర్ గుండా ప్రభాకర్ పర్యవేక్షణలో నల్లగొండ పరిసరాల్లోని గ్రానైట్ శిలలపై ఆయన చేసిన విశేష పరిశోధనకు గాను వర్సిటీ ఈ గౌరవాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, వంశీకృష్ణ సోదరుడు వీరమల్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఆయనను అభినందించారు. తన పరిశోధనకు సహకరించిన ప్రొఫెసర్కు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
వీరమల్ల వంశీకృష్ణ గౌడ్కు డాక్టరేట్
