RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

నాటుసారా రహిత సమాజమే లక్ష్యం: ‘నవోదయం 2.O’ అవగాహన సదస్సు

బండి ఆత్మకూరు, జూన్ 19 (డిగ్నిటి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవోదయం 2.O’ కార్యక్రమంలో భాగంగా బండి ఆత్మకూరు మండలం నారపురెడ్డికుంట గ్రామంలో నాటుసారా తయారీ, అమ్మకాల నివారణపై శుక్రవారం ఒక ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు, జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సాదు రవికుమార్ సూచనలతో ఈ సదస్సు జరిగింది.
ఈ సదస్సులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని, నాటుసారా వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ.. ఈ వృత్తిని మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని సాగించాలని పిలుపునిచ్చారు.

సదస్సులోని ముఖ్యమైన అంశాలు:
ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు: నాటుసారా తయారీని పూర్తిగా మానుకునే కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ₹15,000 ఆర్థిక సహాయం (లోన్) అందించి, కిరాణా దుకాణాలు, కూరగాయల వ్యాపారం, గొర్రెల లేదా బర్రెల పెంపకం వంటి స్వయం ఉపాధి మార్గాలను కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి: సారా తయారీ కుటుంబాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు డీఆర్డీఏ (DRDA), ఉపాధి హామీ పథకం ద్వారా డ్రైవింగ్, టైలరింగ్, కంప్యూటర్స్ వంటి కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.


పిల్లల చదువులకు భరోసా: ఈ కుటుంబాలలోని పిల్లల భవిష్యత్తు కోసం గురుకుల పాఠశాలల్లో సీట్లు ఇప్పించి, వారి ఉన్నత చదువులకు, పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్స్ అందించి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే నాటుసారా మహమ్మారి వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully