RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

జులై 19న ‘గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి’

  • పోస్టర్లను ఆవిష్కరించిన ఆర్పీఎస్, ఆర్‌ఈఎఫ్ నాయకులు
https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002327207.mp4

డిగ్నిటి న్యూస్, నంద్యాల జూన్ 25: నంద్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జులై 19న నిర్వహించనున్న ‘చలో నంద్యాల గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి’ సభ పోస్టర్లను ఆర్పీఎస్, ఆర్‌ఈఎఫ్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు శేషపని, రాష్ట్ర యూత్ అధ్యక్షులు పెరుగు శివకృష్ణ మాట్లాడుతూ, దేశంలో 85 శాతం ఉన్న బహుజనులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002327181.mp4

రాజ్యాంగ పరిరక్షణ, న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు, చట్టసభల్లో బీసీలకు 44 శాతం కోటా, గ్రేటర్ రాయలసీమ గిరిజనులకు 5 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల కేటాయింపుతో పాటు స్థానిక పరిశ్రమల్లో బహుజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, ఈ న్యాయభేరి సభను విజయవంతం చేయడానికి బహుజన ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయ పులికొండన్న, రమేష్ యాదవ్, బి. శ్రీనివాసులు, జాల సురేష్ యాదవ్, దేవా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version