RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

యాగంటి ఆలయానికి రూ.50,112 విరాళం

దాతలకు ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాల వితరణ

బనగానపల్లి, జూన్ 21 (డిగ్నిటి న్యూస్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి ఆదివారం భారీ విరాళం అందింది.

విజయవాడకు చెందిన ప్రముఖ వాస్తవ్యులు శ్రీ బుర్లే వెంకట సుబ్బారావు తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసారు. ఈ సందర్భంగా వారు దేవస్థాన నిత్య అన్నదాన లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రూ.50,112/- ల నగదును విరాళంగా అందజేశారు.

ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్ బండి మౌళేశ్వర రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) పాండురంగారెడ్డికి దాతల కుటుంబం ప్రత్యక్షంగా అందజేసింది.స్వామివారికి విరాళం అందించిన దాతల కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్, ఈవోలు దాతలను శాలువాతో సత్కరించి, స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను గౌరవపూర్వకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version